2024 ఎలక్షన్స్.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-06-02 06:21:34  IST  )

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ 2024 ఎలక్షన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

2024 ఎలక్షన్స్.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ 2024 ఎలక్షన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే ఎలక్షన్స్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో రాహుల్ మాట్లాడారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. రానున్న రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నిక ఉండబోతున్నాయే చూడాలన్నారు. ఇప్పుడు ఇండియాలో ప్రతిపక్షాలు మరింత యూనిటీగా ఉన్నాయన్నారు. విపక్షాల ఐక్యత రైట్ పాథ్‌లో ఉందన్నారు. మీడియా స్వేచ్ఛపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా స్వేచ్ఛ కీలకమైందన్నారు. మీడియాపై బీజేపీ సర్కారు నిర్భందం ఉందన్నారు.

Next Story